Saturday, May 9, 2015

నిన్నటిదాకా ఉన్ని శాలువాకప్పుకున్న
కాశ్మీరం మతవిద్వేషాలతో
తగలబడుతూ కమురుకంపు గొడుతున్నది.
నీవూ నేనూ భాయీ భాయీ అంటూ
తూర్పు పశ్చిమాలు రెండూ అధికారం పంచుకుని
ఆనందం గా ప్రజా సమస్యలను గాలికొదిలేసి
ప్రపంచ శాంతిసదస్సులో పావురాలనెగరేసి
పబ్బంగడుపుకుంటూ,   డాలీ సరస్సులో జాలీగా
జలవిహారంచేస్తూ పారిశ్రామిక వేత్తలకు
పాదాభివందనంజేస్తూ పవిత్రజలాలను నెత్తిపై
జల్లుకుని పునీతులమయ్యామన్న
 భ్రమలో శ్వాసిస్తున్నాయ్.

No comments:

Post a Comment