Sunday, May 17, 2015

రోజులు గడిచేకొద్దీ నీ జడలోని మల్లెలు వాడుముఖం పెడుతున్నాయ్.
భ్రమరాలూ దూరంగా జరిగి విరహ గీతాలు పాడడ0  మొదలెడుతున్నాయ్ .
 అందుకే ప్రతిరేయీ అమూల్యమని  పదే నేను చెపుతుంటాను.
పెద్దలు వేసిన పీటముడులన్నీ ఇప్పుడిప్పుడే
ఒక్కటొక్కటిగా ముడులు వీడి మసలడం మొదలెడుతున్నాయ్.

నీ సామీప్యంలోనే కలలన్నీ సాకారమవుతూసాక్షాత్కరిస్తున్నాయ్.
నీఓడిలో తలపెట్టుకున్నరోజులన్నీ కనులముందు సుస్పష్టంగా  కదులుతున్నాయ్.
మోహావేశంలో నన్ను దింపేసి తారలన్నీ అడవిదారిలో తిరోగమిస్తున్నాయ్.
తారలన్నీ అందమైన చందమామ వెంట శరవేగంగా పరుగెడుతున్నాయ్.

విరహమెంత చేదైన గాధో చందమామ పుస్తకంలోని కధలాగా స వివరంగా బోధచేస్తున్నాయ్.
 వసంతం నాటికయినా  నీ ఆగమనం వుండాలని కచ్చితంగా ఆదేశాలను జారీ చేస్తున్నాయ్.

==============================

No comments:

Post a Comment