Sunday, April 5, 2015

విదేశీ పజ్యాలు-3
----------------
ఇక్కడి గ్రంధాలయాలను
ఆబాలగోపాలం మక్కువతో ఆదరిస్తారు.
అధునాతన సౌకర్యాలతో గ్రంధాలయాలను
అత్యంత శ్రద్ధగా నిర్మిస్తారు.
అందరికీ అందుబాటులో రక  రకాల పుస్తకాలను
రాకుల్లో అమరుస్తారు.
పుస్తకాలతో పాటు డీవీడీలనూ, వీసిడీలనూ
అందిపుచ్చుకోవడానికి వీలుకల్పిస్తారు.
పిల్లలకూ యువతకూ ప్రత్యేక విభాగాలను యెర్పరుస్తారు.

అన్నీ కలిపి పాతిక వేల పైగా అందుబాటులో ఉండేలా చూస్తారు.
పిల్లలకు పుస్తకాలను చదవడంలో శ్రద్ధ కలిగే విధంగా
రచయితలతో కధలు వినిపించే యేర్పాట్లు చేస్తారు.

రెండు దశాబ్దాలు చెల్లినపుస్తకాలనూ, ఎక్కువ ప్రతులున్న పుస్తకాలనూ అమ్మకానికి తక్కువ ధరలకు విక్రయిస్తారు.

వన సం రక్షణ దిశగా విత్తనాలనూ వీటిదారా సభ్యులకు
ఉచితంగా సరఫరా చేస్తారు.
మీరు కోరుకున్న పుస్తకాలు అంతర్జాలంలో వెదకి పట్తుకుని అడిగితే
వారి వారి సమూహంలోని గ్రంధాలయానుంచి తెప్పించి మీకు అందిస్తారు.ప్రభుత్వ సహాయ సహకారాలకన్నా శ్రేయోభిలాషుల
ఆదరణపైనే ఎక్కువగా ఆధారపడి పనిచేసేలా చూస్తారు.

ఉచితంగా సాంకేతిక సేవలనందించేవిధంగా కంప్యూటర్లను
సభ్యులందరికీ అందుబాౠలో ఉండేలా అమరుస్తారు.




No comments:

Post a Comment