Saturday, April 25, 2015

నేరమూ-శిక్ష
---------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్


మా వూరిలో బందెల దొడ్డివున్నది.
కట్టు తప్పి వచ్చిన పశువులూ
గట్టు దాటి ఇతరుల పొలాలో గడ్డిమేసే
పశువులనూ తోలుకొచ్చి అందులోకి
నేట్టేసి అవి గేటు దాటిరాకుండా
గుదిబండలను మెడకు గట్టిగా బంధించి
 గ్రామ సేవకులు కాపలాగాసేవారు.
 గ్రామాధికారులు వాటియజమాబులు
తగిన జరిమానా చెల్ల్లిస్తేనే
వాటిని దొడ్డిలోంచి విడుదలచేసే వారు.


ఇప్పుడు భూసేకరణ మాయాజాలంలో
పొలాలు పోల్పోయిన వారంతా మతి స్థిమితం
కొల్పోయి అందులోకి తంబలు తంబలుగా వచ్చి చేరారు.

యువతకు కడుపు మండింది సిం హాల్లా గర్జించి
ఆ దుస్థికి కారణమయిన నేతలను అందులోకి తోలి
కాళ్ళూ చేతులూ కట్టిపడేసి మళ్ళీ ఎన్నికలొచ్చి
ఓడిపోయే దాకా ఇక్కడే పడుండని ఆవేశంతో ఆదేశించి
ఎవరిగూటికి వారొచ్చి హాయిగా నిద్రించారు.
==============================

No comments:

Post a Comment