Monday, April 27, 2015

పాపం అక్కు పక్షులు=== రావెల
---------------------------------

ఏమిటీ ఇక్కడ మంచెలమీద పచార్లుజెస్తూ
పొట్టకొచ్చిన వరికంకులమీద పాలగింజలను
నమిలిమ్రింగుతూ త్రేంచే పక్షిగణం ఎక్కడా
కను చూపుమెరలో కనబడకుందా పోయాయేం?

ఇక్కడ ముక్కారు పంటలుపండించే పొలాలను
రాతికట్టడాలుగా మార్చేయాలని కొత్త ప్రభుత్వం
నవ్యాంధ్రకోసం వినూత్నమైన నిర్ణయంతీసుకున్నాక
ఆప్రాంతలంలో అంతగా ఇక అవసరంలేని ట్రాక్టర్
పరిశ్రమలొస్తాయని ఖాయంగా తెలిసాక
దున్ని వదిలేసిన భూముల్లో దూడబోతులూ గ్రద్దలూ
రాజకీయ రాబందులు తిష్టవేసి రాజలాంచనాలతో
విడిదిగానూ  ఎంచుకున్నాక బ్రహ్మాస్త్రం పడ్ద పిచ్చుకలకు
సానుభూతిగా పక్షి గణమంతా సెల్ఫోన్ టవర్లెక్కి
నిరశన తెలుపుతున్న సామాన్య ప్రజానీకాలకు
సానుభూతిని స్వచ్చందగా ప్రకటిస్తూ మళ్ళీ మీ మొహం చూడమని
మూకుమ్మడిగా తీర్మానంజేసి పడిపోయిన దిష్టిబొమ్మలపైనుంచి
అన్ని దీక్షలనూ విరమించి ప్రక్క రాష్ట్రాలకు
పక్కా ప్రణాళికతో  మహా ప్రష్థానం సాగించి
పరాన్ముఖతతో  నిష్క్రమించాయి.
===========================27-4-15

No comments:

Post a Comment