Saturday, February 14, 2015

అతడు అడవిని జయించాడు
హృదయారణ్యాలనూ వికసింపజేసాడు.
మూగ వాని పిల్లని గ్రోవితో
జగతినంతటినీ రాగ రంజితం చేసాడు.
శ్మశానాన్ని దున్నే
శ్రమైక జీవనానికి
నాందీవచనమై నిలిచాడు.
ప్రజా వైద్యంలో పేరు గడించాడు
సేవా సాధువుగా జీవనం సాగించాడు
తన ఆరోగ్యాన్ని పణం గాపెట్టి
మందికున్న అనారోగ్యాన్ని అధిగమించేలా
పాటు పడ్డాడు.అందుకే అతను చిరంజీవి
సాహితీ వనంలో వసి వాడిపోని సుమం.
===================================
రచయిత డా//కేశవరెడ్డి మృతికి సంతాప సూచనగా

No comments:

Post a Comment