Thursday, March 12, 2015

మౌన భంగం-----రావెలపురుషోత్తమరావు
[న్యాయబద్ధంగానే సుమా!]
------------------------------------------
దేశ రాజధాని నగరంలో
రాత్రిపూట బస్సులో  కళాశాలనుంచి
ఇంటికి కులసాగా తిరిగొస్తున్న
కన్నె పిల్లకు మాన భంగం జరిగింది.

ఆ పిడుగుపాటు లాంటి సంఘటనను
అభి శంసిస్తూ నిర్భయ చట్టం వెలువడింది.

ఆ మృగాడికి కారాగారవాసం లభించింది.

ఆ 'చక్రధారి' కి ఓ  అంతర్జాతీయ
 వార్తా పసారమాధ్యమంలో
అంతర్వ్యూహానికి అవకాశం దొరికింది.

ఆ అకృత్యాన్ని తన నల్ల కొటును  ధరించిన
దౌర్భాగ్యానికి నల్లరంగు పూసి వాదించే 
అవకాశం ఆబగా దొరికింది.

ఈ చరిత్రహీనమైన సంఘట సంచలనం సృష్టించింది

ఇంకా బ్రదికున్నానని శ్వాసతో నిరూపిస్తున్న్న
న్యాయస్థానం ప్రసారాన్ని ఆపమని ఆదే శించింది.

ఈపిడుగు పాటుకు హతాశువైన కుటుంబానికి
మానని మాన భంగపు గాయానికి పండుకారప్పొడి
పరుచుకునేలా చల్లినట్లు బాధ కలిగింది.

చదువుకున్న విద్యను చట్టుబండలు చేసుకున్న మేధకు
ఈ ఘటన కోపానికి కారణమై నిలిచింది,నేరస్థుడినికాదు
వాడిమనస్తత్వానికి సిక్ష పడాలని బుద్ధి నేరుగా
వక్రీభవనంజెందింది వితండవాదానికి  దిగింది..
ఇది నాగరక సమాజానికి నగుబాటుగా 
తోచిన దాఖాలా మాత్రం కనబడలేదు.
-----
నాణానికి మరోవైపు
---------------
ఎక్కడో తూర్పుదిశగా నిద్రాణంగా వుండే వూరిలో
ఇలాంటి మానభంగానికే  జనాగ్రం తగు శిక్షను అమలు జేసింది.
మధ్యందిన మార్తాండుల్లా తిరగబడే పౌరుషం వచ్చింది.
నేరం చేసాడని ఋజువయిన వాడిని బందిఖానాలోంచి
బయటకు లాగి చావచితగకొట్టి ఆశవాన్ని ఊరంతటికీ
ఎరుకపరుస్తూ ఖబడ్దార్ !!కాగ్రత్త అంటూ హెచ్చరికను
మగ సమాజానికి త్వరితగతిని జారీచేసింది.

ఏ వార్తా ప్రదారమాధ్యమం దీనిని సాహసోపేతమైన చర్యగా
కీర్తించి వారిని ప్రజా రత్నలుగా గౌరవించాలన్న భావనే రాలేదు.

గర్హించాలసిన సంఘటనకు అంతర్జాతీయంగా గౌరవం లభించింది.

గర్వించి భుజకీర్తులు తొడగవలసిన చర్యకు ప్రాశవాసయోగం సిద్ధించిది. 
అనాగరక చర్యగా దూషణకు ఆలవాలమై నిలిచింది.

మానాభిమానాలకు మౌనమే ఆభరణమన్న కీర్తి తోరణం లభించింది.

నల్లకోటుకు,  న్యాయాన్ని గద్దెనెక్కించి ధర్మ సం రక్షణకు
పాటుబడిన కలియుగ పురుషులను కఠినంగా శిక్షించమని వేడుకునే వీలు లభించింది.
=========================================11-3-15

No comments:

Post a Comment