Monday, March 30, 2015

మరువం దవనం ---------
--------------------------

రోజూ అన్ని పూలకుండీలలో నే నే నీళ్ళు పోస్తాను
అన్ని పూలకుండీలతోపాటు మరువం, దవనం మొక్కలూ
ఉన్నయని నాకు తెలియదు. ఎందుకో వాటి దగ్గరకెళ్ళగానే
పరిచితమైన వ్యక్తులే ఆప్యాతతో పలుకరించినట్లుండే ది.

ఒక్క తులసి మొక్క సమ్రఖణమాత్రం ఆవిడే చూసుకునేది.
యేదయినా తన సౌభాగ్యం నాదే గదా అన్న చిన్న
స్వార్ధమేమన్నా నా అంతరాంత రాళాల్లో
 దాగుందేమోకూడా కూడా వివరంగా చెప్పలేను.

ఆపూలకుండిలతో పాటు ఆ మరువం దవనంకూడా నామనసునుదోచుకున్నాయ్.

ఒక రోజెందుకో పూలకుండీలలో దాగున్న కలుపుమొక్కలను
తొలగించాలని కుండీలలో రహస్యంగా పెరుగుతున్న కలుపు మొక్కలను
తొలగిస్తూ యదాలాపంగా ఈరెండు మొక్కలపై నావ్రేళ్ళు తగిలాయి.
కమ్మని సువాసన నన్ను ఇట్టే కట్టే సింది.పూల దండల్లో
తక్కువ స్థాయిలో వాడబడినా ఎంత పరిమళాన్నందిస్తున్నయో
అని తలచుకుంటే ముచ్చటే సింది. అలగే ఆప్రక్కన పెరుగుతున్న
ఓ చిట్టి ఆకులమొక్కను కలుపుమొక్కగా భావించి పీకబోయాను.
అపురూపంగా ఆకులన్నింటినిముడిచేసుకుని బుంగమూతిపెట్తుకున్న
రెండు జడల ఆడపిల్లలా సిగ్గుబడిపోయాయి.
నేను ఎంత తప్పు చేయబోయానో అర్ధమయి కనులవెంట నీరు కారడం మొదలయింది.
మన సమాజంలో ఎన్నో నిష్ఠూరాలకు గురవుతున్న ఆడశిశువులుకూడా
నన్నంటుకోకు ముడుచుకుపోతానని భీష్మిచుకున్నా మొక్క దశలోనే తుంచాలనే కఠిన హృదయాలలో కొంతయినా కారుణ్య భావన పొడసూపితే ఈ అరాచకం కొనసాగదుగదా అని చింతపడ్డాను.
అందుకే నా ఈచిన్ని అనుభవాన్ని అనుభూతినీ అందరితో పంచుకోవాలని ఉబలాట పడ్డాను.

[
శ్రీ కుమరేంద్ర మల్లిక్ గారి ఆంగ్లకవిత చదివిన నేపధ్యంలో]







No comments:

Post a Comment