Tuesday, March 24, 2015

 శిశిర ఝంఝ
------------------రావెల పురుషోత్తమ రావు.
================================================

అప్పుడెప్పుడో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో
చెప్పారోలేదో గుర్తుకు రావడంలేదుగాని
ఇప్పుడు మాత్రం మన్మథ నామ సంవత్సర
పంచాంగం మాత్రం నిక్కచ్చిగా చెపుతున్నది.

రెండు అసెంబ్లీలలోనూ ప్రతిపక్షాలకు
ప్రభుత్వం పరాభవంజేసి బయటకు పంపేసి
తమ గొప్పలు తాము చెప్పుకునే అవకాశాలు
మెండుగా ఉన్నాయని సుస్పష్టంగా విన్న వించింది.


ప్రభుత్వంతీరు అధికారిక సిమ్హాసనం ఎక్కగానే
నీతులు వల్లించేస్థాయికి ఎదిగిపోతుందనీ
పంచాంగ కర్తలు ముందే ఊహించారు.

ఎన్నికలముందు చేసిన వాగ్దానలన్నింటినీ
కట్టగట్టి పారే నదుల్లోనో యేరుల్లోనో మునిగిపోయేలా
నిమజ్జనం చేయండని అమాత్యవరులందరికీ ఆదేశాలు జారీ అయాయి.
కార్యకర్తలంతా లాభదాయకమైన నిర్మాణపు పనుల్లో
గుత్తేదారులుగా అవతారమెత్తుతారని హెచ్చరించిందికూడా.

పచ్చని పంటపొలాలన్నింటినీ రాజధానికోసం రాతికట్టడాలుగా మారి స్మశాన నిస్సబ్దాన్ని తలపోసేలా తయారవుతాయనీ
ఇక పైన ఆహార పదార్ధాల ధరలన్నీ ఆకాశమారగంలోనే

నివాసముండే అవకాశాలు అధికంగా ఉన్నాయనీ వాక్రుచ్చింది.

ప్రజల కష్టాలు మరో ఎన్నికలొచ్చేదాకా ఇలాగే వుంటాయనీ
ఎప్పుడో భవిష్య వాణి వినిపించిందిగదా ఇంకా వెరపెందుకు?
ప్రతిపఖ నెత తన మకిల చరిత్రను కదుగుతారేమోనని
మొహం చాటేసే అవకాశాలు ఉద్ధృతమౌతాయని కూడా చెప్పినట్లు గుర్తు.
================================================

No comments:

Post a Comment