Tuesday, March 17, 2015

ఇందుమూలముగా---------
=================రావెల పురుషోత్తమరావు.

క్షరం కానిది అక్షరమని
నేర్చుకున్నాంగదా మరి ఇలా
ఎందుకు అందరినీ అలరించిన అక్షరం
అగ్నికి ఆహుతై బూడిదగా మిగిలింది?

గజారోహణం చేయించాల్సిన గొంతుకను
పచ్చ బద్దల పల్లకీ పై ఎందుకు
ఊరేగించారో తెలుసుకోవాలనుంది.

అతగాడి వాక్ప్రవహానికి ఎవ్వరు ఇలా
 చెలియలి కట్టను హద్దుగా వేసే 
అవకాశమె లేకుండా చేసేసారు?

అంతమంచిగుండెకెవరు అంతపెద్ద
అపాయాన్ని ఆపాదించి మిన్నకున్నారు?

విద్వాం సుడిని సర్వత్రా పూజిస్తామని
నమ్మ బలికి ఎవ్వరు దూరతీరలకు లాక్కెళ్ళారు?

ఆ కంఠదఘ్నమైన కరుణరసాన్ని ఎవ్వరలా
క్రూరంగా శోకరసంతో పరిప్లావితమయేలా 
గుదిగుచ్చి మరీ ప్రవాసానికి ప్రస్థానం చేయించారు?

ఇవన్నింటికీ సరయిన జవాబులను రాబట్టాలంటే
ఈ ప్రజల ఆస్థానానికి ఆ అవధాన శిరోమణినే
అతిజరూరుగా ప్రవేశపెట్టమని  హుకూం జారీ చేయండి!!!

ఎవరక్కడ? యభటుల్లారా మీరు  తప్పుచేసారనే
 నేరారోపణజరిగింది---సమాధానం చెప్పండి!! 
లేదా మరలా భేతాళుడిని పిలిచి మళ్ళీ  మిమ్మల్ను
చెట్టుకు వేలాడదీయమని చెప్పే హక్కు మాకుందిసుమా!
సమాచార చట్టం ద్వారా సేకరించి మిమ్మల్నిముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తాం 

అతని అభిమానులుగా మాకు న్యాయం జరిపించమని నిలదీస్తామని
ఇందుమూలముగా సంబంధిచిన వారదరినీ హెచ్చరించడమైనది.
ఖబడ్దార్ తస్మాత్ జాగ్రత్త!! 
=================================17-3-15

No comments:

Post a Comment