Thursday, March 19, 2015

దొంగలబండి------
==============రావెల పురుషోత్తమ రావు.
-------------------------------------------------------------------
వాళ్ళ్ళంతా సిoహసనాధీష్టులై
పదవీ వ్యామోహంతో ప్రవర్తిస్తున్నారు.
స్వార్ధం, సంకుచితత్వాన్ని తద్వారా
స్వప్రయోజనాలకోసం--అక్రమార్జనకోసం
అనునిత్యం పరితపిస్తున్న భ్రష్టులు వాళ్ళు.
అధ్యక్షులుగా,రాజులుగా,వాళ్ళ ప్రయోజనాలకోసం
ప్రతినిత్యం పాటుబడే సామంత రాజులూ ఇందులో ఉన్నారు.
వారి వారి గొంతెమ్మకోర్కెలను నెరవేర్చుకోవడంకోసం
మనశ్చాంచల్యం సంప్రాప్తించి, పిచ్చెక్కిన శునకాల్లా
బరితెగించి మరీ ప్రవర్తిస్తున్నారు.

ప్రపంచమంతటినీ పరమ నికృష్టమైన రణరంగం మార్చి
వారి ప్ర్యోజనాలను కాపాడుకోవాలని వారి లఖ్యం.

అందుకే ఈదొంగలబండిని నిండా తమ దేశంకోసం
శ్రేయోదాయకమైన సమాజం కోసం నిరంతరం తపించే
వాళ్ళనందరినీ యేకంచేసి ఈ బండిలో తీసుకెళ్తున్నాను.

ప్రపంచపు శుఖ శాంతులకోసం-- ఆ స్వార్ధపరులైన
పిచ్చికుక్కల్లాంటివారిని పదవీచ్యుతలను గావించడానికి
సదుద్దేశంతో వీరంతా కంకణబద్ధులై బయలుదేరారు.
నాతో సంపూర్ణంగా సహకరించాలనే సత్సంకల్పం గలవారంతా

ఈ దొంగలబండినెక్కి రండి. ఈ ప్రపంచాన్ని శాంతి సుష్థిరతలకోసం 
శ్వాసించేలాతయారుచేసేందుకు దీక్షబూని నాతో సహకరించండి.

==============================19-3-15
ఆంగ్ల కవిత: రసూల్ జిబ్రాయేల్ స్నైమాన్[అనుమతితో]

No comments:

Post a Comment